న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 74కోట్లకుపైగా మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 డోసులు అందజేసినట్లు పేర్కొంది. సోమవారం ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 74,38,37,643 మోతాదులు వేసినట్లు చెప్పింది. 75,64,949 సెషన్లలో టీకాలు వేసినట్లు చెప్పింది. 1,03,64,261 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి.. మరో 85,98,485 మందికి రెండో మోతాదు అందినట్లు చెప్పింది.
1,83,37,884 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి డోస్.. 1,40,44,281 రెండో మోతాదు అందిందని తెలిపింది. 18-44 ఏజ్ గ్రూప్లో 29,92,22,651 మందికి మొదటి.. 4,37,98,076 మందికి సెకండ్ డోస్ వేసినట్లు పేర్కొంది. 45-59 సంవత్సరాల కేటగిరిలో 14,37,03,736 మంది మొదటి, 6,31,16,459 రెండో మోతాదు, 60 ఏళ్లు పైబడిన వారిలో 9,32,06,216 మందికి మొదటి, మరో 4,94,45,594 మందికి సెకండ్ డోస్ వేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.