హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): డబ్బు వినియోగం విషయంలో భారతీయుల ఆలోచనా విధానం క్రమంగా మారుతున్నది. ఒకప్పుడు సంపాదించినదాంట్లో ఎక్కువ శాతం భవిష్యత్తు కోసం కాపాయం (పొదుపు) చేసేవారు. కానీ క్రమంగా కొనుగోళ్లకు, విలాసాలకు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు తాజా సర్వేలో డెలాయిట్ ఇండియా తేల్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో సర్వే చేసి ‘వేవ్-24’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతీయులు ఓవైపు పొదుపు చేసుకుంటూనే.. మరోవైపు ఖర్చుకూ ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా విపత్తు తర్వాత ప్రపంచమంతటా ఓ రకమైన ఆందోళన నెలకొంటే.. భారతీయులు మాత్రం ఖర్చులో వెనక్కి తగ్గలేదని పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తి తగ్గగానే దుస్తులు, వాహనాలు, ఫ్యామిలీ ట్రిప్లు, విమాన ప్రయాణాలు లాంటి వాటిపై ఆసక్తి చూపుతున్నట్టు తెలిపింది.
సర్వేలోని ముఖ్యాంశాలు