పారిస్: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత మహిళల ఆర్చరీ రికర్వ్ జట్టు చేజార్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి క్వాలిఫయర్స్ టోర్నీలో తమ కంటే కిందిస్థాయి ర్యాంకులో ఉన్న కొలంబియా చేతిలో భారత టీమ్ ఓటమి పాలైంది. రెండు నెలల క్రితం ప్రపంచకప్లో స్వర్ణం సాధించిన భారత త్రయం దీపిక కుమారి, అంకిత భకత్, కోమలికా బారి క్వాలిఫయర్స్లో 0-6 తేడాతో కొలంబియా ఆర్చర్లు మారియా రెండోన్, అకోస్టా, సెపుల్వేదా చేతిలో ఓడి నిరాశపరిచారు. కాగా మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక మాత్రమే ఒలింపిక్స్లో బరిలోకి దిగనుంది. 2019 ప్రపంచ చాంపియన్షిప్ ద్వారానే భారత పురుషుల ఆర్చరీ జట్టు విశ్వక్రీడలకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.