తైపీ: గత కొంతకాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్.. తైపీ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో గురువారం కశ్యప్ 21-10, 21-19తో చై హో లీపై విజయం సాధించాడు.
కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ కశ్యప్.. మూడో సీడ్గా బరిలోకి దిగి వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మిథున్ మంజునాథన్, కిరణ్ జార్జ్ ఓటమి పాలవగా.. డబుల్స్లో తనీషా మెరిసింది. మహిళల డబుల్స్లో శృతి మిశ్రాతో కలిసి క్వార్టర్స్ చేరిన తనీషా.. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్తో జతకట్టి సేమ్ సీన్ రిపీట్ చేసింది.