న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార సేవలను పునరుద్ధరించే దిశగా ఐఆర్సీటీసీ అడుగులు వేస్తున్నది. ప్రస్తుతానికి రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సూచనలు కూడా పంపింది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలని ఐఆర్సీటీసీ సూచించింది. అలాగే ఆహారం బుకింగ్, వాటికి సంబంధించిన ధరలు తదితర సమాచారాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని కోరింది.