న్యూఢిల్లీ: భారతీయ నౌకాదళం సరికొత్త చరిత్రను సృష్టించింది. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై .. యుద్ధ విమానం మిగ్-29కే నైట్ ల్యాండింగ్(Night Landing) చేసింది. నిశీధి చీకట్లో ఫైటర్ జెట్ మిగ్29ను సక్సెస్ఫుల్గా విక్రాంగ్ నౌకపై ల్యాండ్ చేశారు. ఇండియన్ నేవీకి చెందిన ప్రతినిధి తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. నేవీ చరిత్రలో ఇది సరికొత్త మైలురాయి అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది సంకేతమని ప్రతినిధి తన ట్వీట్లో తెలిపారు. అత్యంత ఛాలెంజింగ్ పరిస్థితుల్లో ఈ నైట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టారు. విక్రాంత్ సిబ్బందితో పాటు నేవీ పైలెట్లు తమ నైపుణ్యాన్ని, ప్రొఫెషనలిజంను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
#IndianNavy achieves another historic milestone by undertaking maiden night landing of MiG-29K on @IN_R11Vikrant indicative of the Navy’s impetus towards #aatmanirbharta.#AatmaNirbharBharat@PMOIndia @DefenceMinIndia pic.twitter.com/HUAvYBCnTH
— SpokespersonNavy (@indiannavy) May 25, 2023