Ayesha Rashan | చెన్నై, ఏప్రిల్ 24: హార్ట్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక యువతికి భారత్కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్కు చెన్నైలోని ఎంజీఎం హెల్త్కేర్ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు. ఆపరేషన్కు రూ.35 లక్షలు అయ్యిందని, అయితే ఆ మొత్తాన్ని ఎంజీఎం హాస్పిటల్, మెడికల్ ట్రస్ట్ వారే భరించారని, వైద్యమంతా ఉచితంగా అందించారని ఆయేషా తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆయేషా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని డాక్టర్లు తెలిపారు.