న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత బాక్సర్లు సమాయత్తమవుతున్నారు. ఇస్తాంబుల్ వేదికగా మే 6 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీ కోసం భారత మహిళల జట్టు ప్రత్యేక శిక్షణ పొందనుంది. టోక్యో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బర్గోహైతో సహా 12 మంది బాక్సర్లు టర్కీలో 15 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. ఈ మెగాటోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్(52 కి)తో పాటు నీతూ (48 కిలోలు), అనామిక (50 కి), శిక్ష (54 కి), మనీషా (57 కి), జైస్మిన్ (60 కి), పర్వీన్ (63.5 కి), అంకుషిత బొరో (66 కి), లవ్లీనా బొర్గోహై (70 కి), సవితి బూర (75 కి), పూజా రాణి (81 కి), నందిని (+ 81 కి) అదృష్టం పరీక్షించుకోనున్నారు.