న్యూఢిల్లీ: 1984లో సియాచిన్లో అదృశ్యమైన సైనికుడు లాన్స్ నాయక్ చంద్ర శేఖర్ మృతదేహాన్ని తాజాగా బంకర్లో గుర్తించారు. 38 ఏళ్ల తర్వాత ఆ సైనికుడు మృతదేహం లభ్యమైంది. కుమావన్ బెటాలియన్కు చెందిన లాన్స్ నాయక్ చంద్ర శేఖర్..1984లో సియాచిన్ వద్ద జరిగిన ఆపరేషన్ మేఘదూత్లో పాల్గొన్నాడు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. 1984, మే 29న జరిగిన దుర్ఘటనలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియల్లో చిక్కుకున్న 14 మంది మృతదేహాలు అప్పుడే దొరికాయి.
అయితే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర శేఖర్ మృతదేహాన్ని తాజాగా గుర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందం లాన్స్ నాయక్ చంద్రశేఖర్ మృతదేహాన్ని నార్తర్న్ కమాండ్ తీసుకువచ్చింది. మంగళవారం చంద్రశేఖర్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. ఆగస్టు 13వ తేదీన ఓ శిథిలమైన బంకర్లో చంద్రశేఖర్ మృతదేహాన్ని గుర్తించారు. ఆర్మీ నెంబర్ ఉన్న ఐడెంటిఫికేషన్ డిస్క్ను ఆర్మీ పసికట్టింది. ఆ తర్వాత ఆర్మీ అధికారిక రికార్డుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు.
చంద్రశేఖర్ భార్య శాంతి దేవికి ఆగస్టు 14వ తేదీన ఈ సమాచారాన్ని అందజేశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో అంతిమ సంస్కారాలు చేయనున్నారు. కుమావన్ రెజిమెంట్లో చంద్రశేఖర్ 1971లో చేరారు. పాయింట్ 5965ను చేజిక్కించుకునేందుకు సాగిన ఆపరేషన్ మేఘదూత్లో ఆ సైనికుడు పాల్గొన్నాడు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడడంతో 18 మంది సైనికులు మృతిచెందారు.
#WATCH | A patrol of Indian Army recovered the mortal remains of LNk (Late) Chander Shekhar who was missing since 29 May 1984 while deployed at Glacier due to an Avalanche: Northern Command, Indian Army pic.twitter.com/capTnG1APY
— ANI (@ANI) August 15, 2022