సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలువాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. ఇప్పుడు కనీసం సమమైనా చేయాలని జోరుగా సాధన చేస్తున్నది. తొలి పోరులో తేలిపోయిన భారత బ్యాటర్లు.. నెట్స్లో గంటలకొద్ది ప్రాక్టీస్ చేస్తుండగా.. బౌలర్లు తమ అస్ర్తాలకు పనిపెడుతున్నారు. మరి రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులోనైనా మనవాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారా చూడాలి!
కేప్టౌన్: మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం.. ఈ సారి కూడా అందని ద్రాక్ష గానే మిగలగా.. రెండు మ్యాచ్ల సిరీస్ను ‘డ్రా’ చేసేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం ఎదుర్కొన్న రోహిత్ సేన.. తప్పులు సరిదిద్దుకొని సత్తాచాటేందుకు సిద్ధమైంది. సెంచూరియన్ పోరులో బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. బౌలింగ్లో బుమ్రా మాత్రమే రాణించగా.. మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా టెస్టుల్లో వన్డౌన్కు మారినప్పటి నుంచి శుభ్మన్ గిల్ ఆటతీరు దిగజారుతున్నది.
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ అటు సారథిగానూ ఇటు ఓపెనర్గానూ ప్రభావం చూపలేకపోయాడు. బౌన్స్కు సహకరిస్తున్న పిచ్పై సఫారీ పేసర్లను కాచుకోవడం కోసం సోమవారం టీమ్ఇండియా కఠోర సాధన చేసింది. కోహ్లీ, శ్రేయస్ గంటల కొద్ది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శిక్షణను పర్యవేక్షించాడు. లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కునేందుకు మనవాళ్లు కొత్త టెక్నిక్ ప్రయత్నిస్తూ కనిపించారు. బుమ్రా, సిరాజ్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ సుదీర్ఘంగా బౌలింగ్ చేశారు. మరోవైపు షార్ట్పిచ్ బంతులను ఆడేందుకు ఇబ్బంది పడుతున్న శ్రేయస్ వాటిపై సాధన చేశాడు. ప్రాక్టీస్లో భాగంగా గాయపడ్డ పేస్ ఆల్రౌడర్ శార్దూల్ ఠాకూర్ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.