తరోబా: భారీ అంచనాల మధ్య అండర్-19 ప్రపంచకప్లో అడుగుపెట్టి.. తొలి మ్యాచ్లో పటిష్ట దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన యువ భారత జట్టు.. రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. గ్రూప్ -‘బి’లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో యష్ ధుల్ సారథ్యంలోని యంగ్ ఇండియా.. ఐర్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. సఫారీలతో పోరులో ఆకట్టుకున్న కెప్టెన్ ధుల్తో పాటు తెలుగు ఆటగాడు షేక్ రషీద్.. ఓపెనర్ హర్నూర్ సింగ్, నిషాంత్, కౌషల్ బ్యాటింగ్లో కీలకం కానుండగా.. బౌలింగ్లో విక్కీ ఓస్తాల్, రాజ్ బవాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు తొలి మ్యాచ్లో ఉగాండాపై విజయం సాధించిన ఐర్లాండ్ గెలుపు జోరు కొనసాగించాలని చూస్తున్నది.