మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 109 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరుకున్నారు. ఆ ఇద్దరూ మంచి స్టార్ట్ ఇచ్చినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. రోహిత్ 29, మయాంక్ 33 రన్స్ చేసి ఔటయ్యారు. వన్ డౌన్లో వచ్చిన విహారీ, వందో టెస్టు ఆడుతున్న కోహ్లీలు.. ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. విహారీ 30, కోహ్లీ 15 రన్స్తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఉదయం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పీడ్ బౌలర్లతో ఇండియా రంగంలోకి దిగింది. ఇక వందో టెస్టు ఆడుతున్న కోహ్లీని బీసీసీఐ సన్మానించింది. మైదానంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కోహ్లీ భార్య అనుష్కా కూడా పాల్గొన్నది. ఈ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రావిడ్.. విరాట్కు ప్రత్యేక టోపీని అందజేశారు.
What a moment to commemorate his 100th Test appearance in whites 🙌🏻
Words of appreciation from the Head Coach Rahul Dravid and words of gratitude from @imVkohli👏🏻#VK100 | #INDvSL | @Paytm pic.twitter.com/zfX0ZIirdz
— BCCI (@BCCI) March 4, 2022