న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 1.61 లక్షల కేసులు నమోదవగా, తాజాగా లక్షా 72 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 6.8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు పెరగడంతో పాజిటివిటీ రేటు కూడా అధికమయింది.
దస్త్రశంలో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,18,03,318కి చేరాయి. ఇందులో 3,97,70,414 మంది కోలుకోగా.. 15,33,921 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,98,983 మంది బాధితులు మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 2,59,107 మంది కరోనా నుంచి బయటపడగా, 1008 మంది కన్నుమూశారు.
రోజువారీ కేసులు పెరగడంతో పాజిటివిటీ రేటు 10.99 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 167.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.