హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,086 కేసులు నమోదవగా తాజాగా ఆ సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 1,15,212కు చేరాయి. కాగా, మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మరో 28 మంది మహమ్మారికి బలవగా, 15,394 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 3.56 శాతంగా ఉందని పేర్కొన్నది. ఇప్పటివరకు 198.20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.