న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ్యసభలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి చర్చ జరిగిన సమయంలో ఆమె ఈ వివరాలను తెలిపారు. వ్యాక్సినేషన్ స్వచ్ఛంధ అంశమని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా టీకాలు వేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా రెండు డోసుల నూరు శాతం వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తి అవుతుందని టీఎంసీ ఎంపీ డాక్టర్ శంతను సేన్ ప్రశ్నించారు. కోవిడ్ మృతులకు నాలుగు లక్షల నష్టపరిహారాన్ని ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ శక్తిసింఘ్ గోహిల్ అడిగారు.