విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. వీటిలో ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయి 24.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు సర్వే తాజాగా విశ్లేషించింది. ఈక్విటీ మార్కెట్లు నిరాశాజనకంగా ఉండటం వల్లనే ఎఫ్డీఐల్లో క్షీణత నమోదైందని తెలిపింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలు అత్యధికంగా 7.1 బిలియన్ డాలర్లను ఆకట్టుకోవడం విశేషం.