షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 15 స్వర్ణాలు సహా మొత్తం 30 పతకాలు ఖాతాలో వేసుకున్న మన షూటర్లు ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. 4 స్వర్ణాలు సహా 8 పతకాలతో అమెరికా రెండో స్థానం దక్కించుకోగా.. ఇటలీ (4), డెన్మార్క్ (3) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఇక్కడ జరిగిన ట్రాప్ టీమ్ విభాగాల్లో మన పురుషులు, మహిళల జట్లు స్వర్ణాలతో మెరిశాయి. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్, పృథ్వీరాజ్, లక్షయ్ షెరన్తో కూడిన భారత పురుషుల జట్టు ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో 6-4తో స్లోవేకియా టీమ్ను చిత్తుచేసింది. మహిళల విభాగంలో శ్రేయసి సింగ్, రాజేశ్వరి, మనీషా త్రయం 6-0తో కజకిస్థాన్ జట్టును మట్టికరిపించింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధు, గుర్ప్రీత్ సింగ్, ఆదర్శ్ సింగ్తో కూడిన భారత జట్టు రజత పతకం సొంతం చేసుకుంది.