దుబాయ్: ఇంగ్లాండ్తో టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమ్ఇండియా వన్డే సిరీస్నూ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గి ట్రోఫీని దక్కించుకుంది. ఇంగ్లాండ్పై సిరీస్ విజయం తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నది.
టీమ్ఇండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ 121 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్గా కొనసాగుతోంది. వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో న్యూజిలాండ్(118)ను మూడో స్థానానికి నెట్టిన భారత్ 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా 108 పాయింట్లతో ఐదో ర్యాంకులో నిలిచింది.