దుబాయ్: ఆరేండ్ల తర్వాత టీ 20 ఫార్మాట్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ద్వారా టీమ్ఇండియా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానానికి దూసుకెళ్లింది. ఆరేండ్ల తర్వాత 269 రేటింగ్తో మళ్లీ టాప్లోకి చేరుకుంది. రేటింగ్ పరంగా భారత్(10, 484)తో ఇంగ్లండ్(10, 474)సమంగా ఉన్నప్పటికీ పాయింట్ల విషయంలో తేడాతో రెండో ర్యాంక్లో ఉంది. సోమవారం విడుదలైన ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ (266), న్యూజిలాండ్ (255), దక్షిణాఫ్రికా (253) వరుసగా మూడు, నాలు గు, ఐదు ర్యాంక్ల్లో ఉన్నాయి. ప్లేయర్ల ర్యాంకుల్లో కేఎల్ రాహుల్(729), విరాట్ కోహ్లీ(657) టాప్-10 చోటు దక్కించుకున్నారు. బౌలింగ్, ఆల్రౌండర్ల విభాగాల్లో భారత్ నుంచి ఒక్క ప్లేయర్ లేకపోవడం విశేషం.