జైపూర్: భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. తొలి ఓవర్లోనే డారియల్ మిచెల్ (0) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మార్క్ చాప్మ్యాన్ (63), మార్టిన్ గప్తిల్ (70) ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో చాప్మ్యాన్ను అశ్విన్ అవుట్ చేశాడు.
ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ (0) ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ సేఫెర్ట్ (12)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర (7)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 164/6 స్కోరు చేసింది. భారత్కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్లకు చెరో వికెట్ దక్కింది.