ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (57) పెవిలియన్ చేరాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత రాహుల్, రోహిత్ (15) ఇద్దరూ భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో మ్యాక్స్వెల్ వేసిన 8వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్.. డీప్ మిడ్వికెట్లో ఆస్టన్ అగర్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు. ఈసారి ఆస్టన్ అగర్ వేసిన బంతిని డీప్ మిడ్వికెట్ వైపు భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. కానీ అది విఫలం అవడంతో అక్కడ ఉన్న మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 82/2 స్కోరుతో నిలిచింది.