ఆసియా కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. ఆ తర్వాత మరోసారి మూడో ఓవర్లో కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత పవర్ప్లే చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అర్షదీప్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అఫ్ఘాన్ సారధి మహమ్మద్ నబీ (7) ఎల్బీగా మైదానం వీడాడు. దీంతో ఆ జట్టు పవర్ప్లే ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.
ఆ తర్వాతి ఓవర్లో మరోసారి బంతి అందుకున్న భువనేశ్వర్ కుమార్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (1)ను అవుట్ చేశాడు. ఇది ఈ మ్యాచ్లో అతనికి ఐదో వికెట్ కావడం గమనార్హం.