న్యూఢిల్లీ: గతంలో పోల్చితే రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారి సంఖ్య భారీగా పెరిగింది. 2021లో మొదటి తొమ్మిది నెలల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1.78 కోట్ల మందిని రైల్వే అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 1,017.48 కోట్ల జరిమానాను వసూలుచేసినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు తీవ్రంగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ప్రయాణికుల సంఖ్య 27 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఆర్టీఐ పిటిషన్కు రైల్వేబోర్డు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.