బిజినేపల్లి, మార్చి 23 : దక్షిణ తెలంగాణలో వానకాలం సీజన్లో 9,23, 492 హెక్టార్లలో సాధారణ పంటల సా గు విస్తీర్ణమని ప్రొఫెసర్ జయశంకర్ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. గత యాసంగితో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. వర్షపాతం పెరగడం వల్లే పంటల సాగు పెరిగిందని చెప్పారు. బుధవారం మండలంలోని పాలెం గ్రామ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన దక్షిణ తెలంగాణ మండలి వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం రెండ్రోజుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కలెక్టర్ ఉదయ్కుమార్తోపాటు కలిసి ఆయన హాజరై మాట్లాడారు. దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల, నల్లగొండ, సూర్యపే ట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లు ఉన్నాయన్నారు. రైతులు ఆర్గానిక్ ఉ త్పత్తుల తయారీపై దృష్టి సారించేలా వంగడాలను రూపొందించాలని సూ చించారు. భూసార యాజమాన్య పద్ధతులు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వాతావరణ మార్పు, మెట్ట వ్యవసాయంలో ఆధునికత సాంకేతికత వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం, పెసర పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ రైతులకు చే రువయ్యేలా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో మేలు రకమైన వంగడాలను కనిపెట్టాలన్నారు. ప్రతిసారి వరి వేయకుం డా చిరుధాన్యాలు పండించేలా రైతుల ను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వేరుశనగ, పచ్చిమిర్చి, పత్తి సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించి రైతులు అధిక లాభాలు గడించే లా వంగడాలను రూపొందించాలని చె ప్పారు. ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే సాగు శాతం గణనీయంగా పెరిగిందన్నా రు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన రైతు రా జు ప్రకృతి వ్యవసాయం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా ఉత్తమ రైతు అవార్డును అందజేశారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు.
కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు సుధారాణి, ఏడీఆర్ గోవర్ధన్, డీఏవో వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్రావు, కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.