IT Refund | గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 1.45 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1.49 లక్షల కోట్లు రీఫండ్ చేశామని ఐటీశాఖ మంగళవారం తెలిపింది. సోమవారం నాటికి 4.67 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. వాటిలో 1.42 కోట్ల సంస్థలు, వ్యక్తులకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.50,793 కోట్లు రీఫండ్ చేసినట్లు ఐటీశాఖ ట్వీట్లో తెలిపింది. 2.19 లక్షల పై చిలుకు కేసుల్లో రూ.98,504 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది.
దీంతో సీబీడీటీ గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 27 వరకు 1.45 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు 1,49,297 కోట్లకు పైగా రీఫండ్ చేశామని వివరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి శుక్రవారం తుది గడువుకావడంతో వేతన జీవులు, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల్లో వేగం పెరిగింది. కేవలం సోమవారం నాడే 15.49 లక్షల మంది ఐటీఆర్ సమర్పించారు.