యాదాద్రి భువనగిరి : జిల్లాలో కరోనా కోరలు చాస్తున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం 59 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో నలుగురు ఆలయ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 27 నుంచి నిర్వహించిన పరీక్ష ల్లో 126 మందికి యాదగిరిగుట్టలో కరోనా నిర్ధారణ జరిగింది. ఇందులో 66 మంది ఆలయ సిబ్బంది ఉన్నారు.