నాగ్పూర్, మార్చి 2: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరప్రదేశ్ రైతులు బీజేపీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు పరిహారం కోసం, కనీస మద్దతు ధరల చట్టం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులను తరలించడంలో కేంద్రం ఆలస్యం చేయడం వల్లే ఉక్రెయిన్లో ఒక భారతీయ విద్యార్థి చనిపోయాడని ఆరోపించారు.