భిక్కనూరు, ఫిబ్రవరి 16: ఫ్లెక్సీ వివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల ముందే చేయిచేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా బస్వాపూర్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని బుధవారం రాత్రి ఎవరో చింపేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై గురువారం ఫిర్యాదు చేయగా, ఎస్సై సాయికుమార్ పలువురిని పోలీస్స్టేషన్కు పిలిపించి వివరాలు సేకరించారు.
అక్కడే ఉన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తుడం జీవన్ రెచ్చిపోయి సదరు బీఆర్ఎస్ కార్యకర్తలపై చేయిచేసుకున్నారు. ఈ విషయం బయటికి తెలియడంతో సదరు కార్యకర్తల కుటుంబ సభ్యులు, నాయకులు శుక్రవారం ఉదయం పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే భీంరెడ్డి, తుడం జీవన్ను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.