ముంబై : మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఉపాధి కోసం కోల్కతా నుంచి ముంబై వచ్చిన మహిళ(19)పై బంధువు సహా ముగ్గురు ఇతరులు ఈ దారుణానికి తెగబడ్డారు.
ఈ ఏడాది మార్చిలో బంధువుతో కలిసి ఉద్యోగం వెతుక్కునేందుకు బాధితురాలు నగరంలోని కుర్లా ప్రాంతానికి వచ్చింది. డబ్బు కోసం బంధువు ఆమెను రేపిస్టులకు అప్పగించడంతో వారు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.