గువహటి : ఐఐటీ గువహటికి చెందిన విద్యార్ధి శుక్రవారం రాత్రి తన హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడటం ఐఐటీ గువహటి క్యాంపస్లో కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐఐటీ విద్యార్ధి ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నాడనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై ప్రాధమిక దర్యాప్తు అనంతరం విద్యార్ధి ఆత్మహత్యకు కారణం, అందుకు దారితీసిన పరిస్ధితులపై వివరాలు తెలుస్తాయని ఎస్పీ హితేష్ సీహెచ్. రే తెలిపారు.