అహ్మదాబాద్ : గుజరాత్లోని సూరత్లో అంబులెన్స్లో తరలిస్తున్న రూ 25 కోట్ల ఫేస్వ్యాల్యూతో కూడిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో నకిలీ నోట్లు ఉన్నాయనే సమాచారంతో అంబులెన్స్ను అడ్డగించిన పోలీసులు వాహనం నుంచి నకిలీ ఇండియన్ కరెన్సీని సీజ్ చేశారు.
ఆరు బాక్సుల్లో 1290 బండిల్స్లో నోట్లను తరలించడాన్ని పోలీసులు కనుగొన్నారు. సూరత్లోని కమ్రేజ్ ప్రాంతంలో అంబులెన్స్ను పోలీసులు నిలిపివేశారు. రూ 2000 నోట్లతో నకిలీ కరెన్సీని తరలిస్తుండగా వీటిపై రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించిఉంది.
ఇక అంబులెన్స్పై ఒక భాగంలో దిక్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్-సూరత్ అని రాసి ఉండగా మరో వైపు గో మాత రాష్ట్ర మాత అని రాసి ఉంది. ఈ నోట్లను ఎక్కడ ముద్రించి ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనేది అంబులెన్స్ డ్రైవర్ను ప్రశ్నిస్తున్నామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని ఎస్పీ హితేష్ జోసర్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్ధలానికి చేరుకుందని అధికారులు పేర్కొన్నారు.