హిమాయత్నగర్, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని పలువురు వక్తులు అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డివిజన్లోని పోలింగ్ బూత్ల్లో ఓటర్లు, బీఎల్వోలు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాగం కల్పించిన ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకుని, వినియోగించుకోవాలని అన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారికి ఆప్లికేషన్లు అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ తిరుపతి నాయక్, బీఎల్వో సూపర్వైజర్ జాన్, ఎస్ఎఫ్ఏలు సతీశ్చంద్ర, కామేశ్, సోమయ్య, శ్రీనివాస్, మధు, ఆశవర్కర్లు స్వప్న, మీనాక్షి, ఆసియాబేగం, అరుణ, లత తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్లో..
బంజారాహిల్స్, జనవరి 25: జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త ఓటర్లుగా నమోదుతో పాటు చిరునామా మార్పుకోసం దరఖాస్తులు స్వీకరించారు. బంజారాహిల్స్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను కార్పొరేటర్ కవితారెడ్డి పరిశీలించారు.
25బీహెచ్7బంజారాహిల్స్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కార్పొరేటర్
ఖైరతాబాద్లో..
ఖైరతాబాద్, జనవరి25: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రతినభూనుతున్న జడ్సీ రవికిరణ్, డీసీ వంశీకృష్ణ, ఎన్నికల సిబ్బంది శ్రీనివాస్ తదితరులు