న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్పూర్ ఐఐటీ, జోధ్పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తాయి. వీటి లోపల సెన్సర్లు ఉంటాయి. ఈ గ్లౌజులను ధరించి సైగలు చేసినప్పుడు వాటి నుంచి ఎలక్ట్రికల్ సిగ్నళ్లు వెలువడుతాయి. వేళ్లు, మణికట్టు, అరచేతి కదలికలను బట్టి ఎలక్ట్రిక్ సిగ్నళ్లు మారుతుంటాయి. ఈ సిగ్నళ్లు ఆడియో ట్రాన్స్మిటర్ నుంచి మాటలుగా వినిపిస్తాయి. మూగవాళ్లు ఏమైనా చెప్పాలనుకొన్నప్పుడు అవతలి వారికి అది తెలిసిపోతుంది. వీటి ధర 5వేల కంటే తక్కువే.