న్యూఢిల్లీ: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బహేరా అన్నారు. 1993లో తన స్నేహితుడి కుటుంబసభ్యులు దెయ్యాల సమస్యతో బాధపడుతుంటే తాను సహాయం చేసినట్టు చెప్పారు. భగవద్గీతలో మంత్రాలు చదివి, పూజలు చేసి వాటిని పారదోలినట్టు పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతు న్నది. ఐఐటీ మండి డైరెక్టర్గా లక్ష్మీధర్ ఇటీవలే నియమితులయ్యారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ చేశారు. రోబోటిక్స్, కృత్రిమ మేధలో నిష్ణాతులు.