వెంగళరావునగర్, డిసెంబర్ 1 : వెంగళరావునగర్ డివిజన్లోని రహమత్నగర్లో నూతన సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు నిధులు మంజూరై శంకుస్థాపన జరుగడంతో ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యను స్థానిక కార్పొరేటర్కు వివరించగా ఆమె నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ప్రత్యేక చొరవతో రూ.40 లక్షలు మంజూరు చేయగా, ఆ పనులకు బుధవారం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కార్పొరేటర్ దేదీప్య విజయ్ కుమార్తో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం దిలీప్ కుమార్, మేనేజర్ రమేశ్, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ యాదవ్, చిన్న రమేశ్ తదితరులు పాల్గొన్నారు.