పనాజీ : కోస్టల్ జోన్ నిబంధనలను ఉల్లంఘించిన గోవాలోని కర్లీస్ రెస్టారెంట్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. లగ్జరీ రెస్టారెంట్ను కూల్చివేయాలని గోవా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సమర్ధించింది. ఎన్జీటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పర్యాటకులకు హాట్ డెస్టినేషన్గా మారిన కర్లీస్ రెస్టారెంట్ నేలమట్టం కానుంది.
ఎన్జీటీ నిర్ణయంతో రెస్టారెంట్ను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా నటి, బీజేపీ నేత సొనాలి పోగట్ మరణించేందుకు కొన్ని గంటల ముందు ఇదే రెస్టారెంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో ఆమెకు తన అనుచరులు ఇద్దరు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. సొనాలి పోగట్ మృతి కేసులో ఆమె అనుచరులను ఇద్దరినీ గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.