న్యూఢిల్లీ: ఐసీసీ ర్యాంకింగ్స్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండవ స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ కన్నా అయిదు పాయింట్లు ఇండియాకు ఎక్కువగా ఉన్నాయి. రేటింగ్కు సంబంధించిన అయిదు స్థానాల్లో ఇండియా(270), ఇంగ్లండ్(265), పాకిస్థాన్(261), సౌతాఫ్రికా(253), ఆస్ట్రేలియా(251) ఉన్నాయి.
ఇక టెస్టు ర్యాంకింగ్స్లో తాజా అప్డేట్ ప్రకారం.. ఆస్ట్రేలియా(128) టాప్లో నిలిచింది. ప్రస్తుతం రెండవ స్థానంలో ఇండియా(119) ఉంది. ఇండియా కన్నా ఆస్ట్రేలియా 9 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఇక వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నాయి.