చెన్నై: బౌలర్ చేతి నుంచి బంతి విడుదల కాకముందే నాన్స్ట్రయికింగ్లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే దాన్ని రనౌట్గా పరిగణించనున్నట్లు ప్రకటించిన ఎమ్సీసీ నిర్ణయాన్ని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వాగతించాడు. ఐపీఎల్ 2019 సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ను ఇదే తరహాలో ఔట్ చేసి అశ్విన్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగగా.. తాజాగా ఎమ్సీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ సందర్భంగా గురువారం అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఇక బౌలర్లు ప్రశాంతంగా బౌలింగ్పై దృష్టి పెట్టొచ్చు. నాన్స్ట్రయికింగ్ ఆటగాడు ముందుకు వెళ్తాడా అనే ఆలోచన అక్కర్లేదు. గతంలో ఇలా చేయడం ద్వారా బ్యాటర్లు అదనపు ప్రయోజనం పొందేవాళ్లు. ఇప్పుడిక ఆ ఆటలు చెల్లవు’ అని వివరించాడు.