హైదరాబాద్, ఫిబ్రవరి 3: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) తన 30వ వార్షిక సమ్మిట్ను ఈ నెల 8న హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నాస్కాం మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్కు లైఫ్టైం అచివ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. RRR(Re-imagine, Re-Think, Re-Build) అనే నినాదంతో జరుగుతున్న ఈ వార్షిక సమ్మిట్లో ఐటీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. 500 మంది డెలిగేట్లు హాజరవనున్న ఈ సదస్సులో 100 మందికి పైగా ఐటీ ఇండస్ట్రీ నిపుణులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
అతిథులు వీరే
రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్
ఎల్టీఐమైండ్ట్రీ సీఈవో, ఎండీ దేబాశిష్ చటర్జీ
సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి
డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్