హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కె.ఎ.రెసిడెన్సీ భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు భవనం నేలమట్టమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉండే వారిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఆ రెండు భవనాల్లోని 45 ప్లాట్లలో అద్దెకు ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నాయి. ఇక సర్వే నంబర్ 171, 172, 173, 174, 175, 212, 213 లో రెండుకరాల్లో నిర్మించిన న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.