బరోడాపై హైదరాబాద్ విజయం
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-‘బి’లో భాగంగా శనివారం ముగిసిన పోరులో హైదరాబాద్ 43 పరుగుల తేడాతో బరోడాను చిత్తు చేసింది. రవితేజ (56), చందన్ సహాని (54), రోహిత్ రాయుడు (49) రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో 201 పరుగులకు ఆలౌటైన హైదరాబాద్.. ప్రత్యర్థి ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో బరోడా 192 రన్స్కే పరిమితమవడంతో హైదరాబాద్ విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రవితేజ 4 వికెట్లు పడగొట్టాడు.