న్యూఢిల్లీ, జూలై 1: ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్లకు చెందిన పలువురు రాజకీయ నాయకులుసహా 100 మందికి పైగా ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్నకు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ జారీ చేసిన ఈ విజ్ఞప్తిపై భారత్కు చెందిన 61 మంది, పాక్కు చెందిన 56 మందిసహా మొత్తం 117 మంది సంతకాలు చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన భారతీయుల్లో ఫరూక్ అబ్దుల్లా, వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మెహబూబా ముఫ్తీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా ఉన్నారు. సంతకం చేసిన పాక్ ప్రముఖుల్లో మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ కసూరీ, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ ఖాజీ, స్ఫన్యర్ భండారా, అణు శాస్త్రవేత్త, పర్వేజ్ హూద్భాయ్ ఉన్నారు.