సిటీబ్యూరో, డిసెంబర్ 27 : నగరంలో ఉదయం వేళ మంచుదుప్పటి కప్పుకుంటున్నా.. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రానికి మాత్రం చలి తీవ్రత తగ్గుతున్నది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ కాగా.. కనిష్ఠం 18.4.. గాలిలో తేమ 56శాతంగా నమోదయ్యింది.
సోమవారం వేకువజామున మహా నగరంపై పొగ మంచు దుప్పటి కప్పేసింది. చలిగాలులతో కూడిన మంచు కురుస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను కూడా కనిపించనంతగా చిరు జల్లులతో పొగ మంచు కమ్మేసింది. అఫ్జల్గంజ్, చార్మినార్ పరిధుల్లో ఈ వాతావరణం ప్రధానంగా కనిపించింది. మంచుతో చార్మినార్, ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు మసకబారిపోయాయి. మంచు కురిసే వేళలో ప్రయాణికులు గజగజ వణుకుతూనే బస్సుల కోసం వేచి ఉండటం గమనార్హం.