మన దేశంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో వెలిశాయి. అలాంటి వాటిలో ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపుర్(Pandharpur) దేవాలయం. స్థానికంగా అక్కడి ప్రజలు పాండురంగ (Pandurangadu) స్వామిని విఠలుడు (Vitala swamy) అని పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు (Sri Maha Vishnuvu) తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాదించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని భక్తుల నమ్మకం. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా పండరీపుర్, షిరిడీ (Shiridi) వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షిర్డీ పండరీపుర్ టూర్’ (Shirdi Tour) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. బస్సు మార్గంలో (BUS Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
‘షిర్డీ పండరీపుర్ టూర్’ (SHIRDI PANDHARPUR TOUR) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి శనివారం ఈ ప్యాకేజీ (PANDHARPUR Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో పండరీపుర్ (Pandharpur), షిరిడీ (Shiridi), శని శింగణాపూర్ (Shani Shinganapur) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
‘షిర్డీ పండరీపుర్ టూర్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో (Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ నుండి మధ్యాహ్నం 03:00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. బషీర్బాగ్లో సాయంత్రం 04:00 గంటలకు.. యాత్రి నివాస్, సర్దార్ పటేల్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ నుంచి సాయంత్రం 05:00 కు, పర్యాటక్ భవన్, బేగంపేట్ నుంచి సాయంత్రం 05:15 గంటలకు, కేపీహెచ్బీ VRK సిల్క్స్ నుంచి సాయంత్రం 06:15 గంటలకు, చందానగర్ నుంచి సాయంత్రం 06:30 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ (Overnight Journey) ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం శని శింగణాపూర్ చేరుకుని.. శని దేవుడిని దర్శనం చేసుకుంటారు. అనంతరం.. షిరిడీకి బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు షిరిడీ చేరుకున్న తర్వాత హోటల్లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం(Shiridi Sai Baba darshan) (పర్యాటకుల స్వంత ఖర్చుతో) ఉంటుంది. భోజనం తర్వాత రాత్రి షిరిడీలోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు షిరిడీ నుంచి పండరీపుర్కు బయలుదేరుతారు. పండరీపుర్ చేరుకున్న అనంతరం చంద్రభాగా నదిగా పిలవబడుతున్న భీమా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత పర్యటకులు నదికీ సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. పాండురంగడి దర్శనం అనంతరం.. తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అవుతారు.
Day 4: తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ ‘షిర్డీ పండరీపుర్ టూర్’ ప్యాకేజీ ధర
Hyderabad to Tour cost | నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.3100, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.2530 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
గమనిక: రవాణా, వసతి ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/shirdipandharpur