హైదరాబాద్ సిటీబ్యూరో, 26 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజలు ఈ సారి గ్రీన్ దీపావళి జరుపుకోనున్నారు. పర్యావరణానికి హానిచేయని పటాకులను విక్రయించనున్నట్టు, 80 శాతం గ్రీన్క్రాకర్స్కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ మంగళవారం తెలిపింది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ నిబంధనల ప్రకారం పటాకులను విక్రయిస్తామని పేర్కొన్నది. హోల్సేల్స్, రిటైల్గా అమ్మకాలు జరిపేవారు సీఎస్ఐఆర్, నీరి ఇండియా ముద్ర కలిగిన గ్రీన్క్రాకర్స్ను విక్రయిస్తారని వెల్లడించింది.