బంజారాహిల్స్, నవంబర్ 24: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని బీమా సౌకర్యాన్ని పొందాలని బంజారాహిల్స్ సహాయ కార్మికశాఖ అధికారి వేణుగోపాల్ సూచించారు. బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 12లోని కమాన్వద్ద లేబర్ అడ్దాలో కూలీలకు ఈ -శ్రమ్ పోర్టల్పై అవగాహన కల్పించారు. ఇండ్లలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు ఇస్తారని, వారికి ప్రమాదబీమా సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ ప్రాంతంలో 700మంది ఈ-శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు.