కీసర, నవంబర్ 22 : కీసరగుట్ట పరిసరాలు శివభక్తులతో కోలాహలంగా మారాయి. కార్తిక మాసోత్సవంలో భాగంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసం మూడవ సోమవారం భక్తులు కీసరగుట్టకు చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30గంటల నుంచి గర్భాలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు, వేదపండితులు స్వామికి పంచామృతాలతో పాటు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
స్వామిసేవలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్..
తెలంగాణ ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా కుటుంబ సమేతంగా కీసరగుట్ట ఆలయానికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి, వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ఆయన ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చైర్మన్ను సన్మానించి, స్వామివారి ప్రసాదంను అందజేసి వేదపండితులతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్తలు బోడుసు రమేశ్గుప్త, ఆర్.శ్రావన్కుమార్గుప్తా, నరేశ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.