బంజారాహిల్స్, నవంబర్ 21: వైద్యులకు సరైన కమ్యూనికేషన్ అవసరమని, అది లేకపోవడంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి, ఆరోగ్య సంక్షేమశాఖతో పాటు పలు సంస్థల సహకారంతో కమ్యూనికాన్-2021 పేరుతో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్తో కలిసి ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. కమ్యూనికేషన్ అనేది ఎదుటివారితో మరిం త దగ్గర చేస్తుందని, చెప్పాల్సిన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం ఎంతో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రెసిడెంట్ డా.అభిజిత్, అపోలో గ్రూపు ప్రెసిడెంట్ డా.కె.హరిప్రసాద్ పాల్గొన్నారు.