రవీంద్రభారతి, నవంబర్ 21 : హృదయాన్ని తాకేలా కథలు రాయాలని ప్రముఖ కవి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు మంగారి రాజేందర్(జింబో) అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘బుగులు’ తెలంగాణ కథ-2020 ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మనిషి జీవితం కథతోనే మొదలై కథతోనే ముగుస్తుందన్నారు. డా.కాంచనపల్లి గోవర్దన్రాజు మాట్లాడుతూ సింగిడి రచయితల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కథా సంకలనాల పరంపర నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ బుగులు తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత డా.పసునూరి రవీందర్, కథకులు మేడి చైతన్య, యామిని నల్ల, అక్కల చంద్రమౌళి, చందు, తులసి, ఏశాల శ్రీనివాస్, డా.మామిడాల రమేశ్ బాబు, సంగి రమేశ్, అంబటి వెంకన్న, గుడిపల్లి నిరంజన్, కోడం కుమారస్వామి, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.