సికింద్రాబాద్, మార్చి 5: తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ (టీపీఈటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2022 నూతన డైరీని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి శనివారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్క ఎలక్ట్రికల్ కార్మికుడు ఐక్యంగా ఉంటూ, వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని, తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పాటు ప్రమాద బీమా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలని చెప్పారు. ఫెడరేషన్కు చెందిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సామ కొండల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి బాలస్వామి, ఖమ్మం జిల్లా ఇన్చార్జి మజీద్, నల్గొండ జిల్లా ఇన్చార్జి బ్రహ్మచారి, మేడ్చల్ అధ్యక్షుడు ఎస్. రవిశంకర్, సంయుక్త కార్యదర్శి పి. రవీందర్, సభ్యులు వెంకటేష్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వివేక్, సహాయ కార్యదర్శి కుమాస్వామి, రంగారెడ్డి జిల్లా కోశాధికారి మహేష్తో పాటు శ్రీను, భిక్షపతి, రవి, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.